Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విపరీతమైన దాహం.. నీళ్లనుకుని శానిటైజర్ తాగేశాడు..

Advertiesment
Visakapatnam
, ఆదివారం, 7 జూన్ 2020 (13:06 IST)
Sanitizers
వేసవి తాపం. విపరీతమైన దాహం వేసింది. అదే ఆ అటెండర్ పాలిట శాపంగా మారింది. వేసవిలో దాహాన్ని తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న శానిటైజర్‌ను నీళ్లనుకుని తాగిన అటెండర్‌ చికిత్సపొందుతూ మృతి చెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న సత్తిబాబుకు శనివారం మధ్యాహ్నాం కార్యాలయంలో దాహం వేసింది.
 
పొరపాటున పక్కనే ఉన్న వాటర్‌ బాటిల్‌ బదులు శానిటైజర్‌ను తాగడంతో అస్వస్థకు గురయ్యాడు. దీంతో తోటి ఉద్యోగులు స్థానిక దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్సను అందజేశారు. ఇంటికి వెళ్లిన సత్తిబాబు అర్ధరాత్రి మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో: డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది పాటు ఫ్రీ.. ఎవరికంటే?