Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమేష్‌కుమార్‌కు రక్షణ కల్పించాలి: అఖిలపక్షం

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. తెదేపా, కాంగ్రెస్‌, సీపీఐ, ఆమ్‌ఆద్మీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఈమేరకు పది పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. 
 
అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ మాట్లాడుతూ... ఏకగ్రీవాలతో సహా అన్నింటినీ రద్దు చేసి రీనోటిఫై చేయాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. కేంద్ర హోం మంత్రికి ఎస్‌ఈసీ నుంచి వెళ్లిన లేఖ ఆయన కార్యాలయం నుంచే వెళ్లినట్టు భావిస్తున్నామని తెలిపారు. 
 
ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ పేరిట బయటకొచ్చిన లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని ఆయనకు భద్రత కల్పించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. వైకాపా నేతలు పోలీసుల అండతో ఇతర పార్టీల నేతలను భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments