చికెన్ తింటే కరోనా వస్తుందా.. నిరూపిస్తే కోటి రూపాయలిస్తాం..?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (15:03 IST)
కరోనాతో ప్రస్తుతం ప్రపంచమంతా గజగజలాడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చికెన్ తినాలంటేనే జనం జడుసుకుంటున్నారు. దీంతో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు బంపరాఫర్ ప్రకటించారు. కోడిగుడ్లు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుంది నిరూపిస్తే రూ.కోటి రూపాయలు బహుమతి అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్‌ సొసైటీ సంయుక్తంగా వెల్లడించాయి. 
 
కరోనా వైరస్ దెబ్బకు కోడిగుడ్లు, చికెన్ ధరలు పడిపోయిన తరుణంలో పౌల్ట్రీకి పాపులరైన నామక్కల్‌లో కోళ్ల ఫారం యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీనితో కోడి గుడ్డు ధర రూ. 1.3 పడిపోగా, కోడి మాంసం రూ. 20కి తగ్గింది. 
 
ఇది కూడా కేవలం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతుల వల్లే జరిగిందని అక్కడి రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికెన్ తినడంతో వస్తుందని నిరూపిస్తే కోటి రూపాయలు ఆఫర్ ఇస్తామని పౌల్ట్రీ రైతులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments