Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటే కరోనా వస్తుందా.. నిరూపిస్తే కోటి రూపాయలిస్తాం..?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (15:03 IST)
కరోనాతో ప్రస్తుతం ప్రపంచమంతా గజగజలాడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చికెన్ తినాలంటేనే జనం జడుసుకుంటున్నారు. దీంతో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు బంపరాఫర్ ప్రకటించారు. కోడిగుడ్లు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుంది నిరూపిస్తే రూ.కోటి రూపాయలు బహుమతి అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్‌ సొసైటీ సంయుక్తంగా వెల్లడించాయి. 
 
కరోనా వైరస్ దెబ్బకు కోడిగుడ్లు, చికెన్ ధరలు పడిపోయిన తరుణంలో పౌల్ట్రీకి పాపులరైన నామక్కల్‌లో కోళ్ల ఫారం యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీనితో కోడి గుడ్డు ధర రూ. 1.3 పడిపోగా, కోడి మాంసం రూ. 20కి తగ్గింది. 
 
ఇది కూడా కేవలం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతుల వల్లే జరిగిందని అక్కడి రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికెన్ తినడంతో వస్తుందని నిరూపిస్తే కోటి రూపాయలు ఆఫర్ ఇస్తామని పౌల్ట్రీ రైతులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments