Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు విజ‌య‌వాడకు వ‌స్తున్న ఉమెన్ చాందీ

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (10:43 IST)
ఆంధ్ర రత్న భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్ర‌త్యేకంగా ఉమెన్ చాందీ విజ‌య‌వాడ‌కు వ‌స్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈనెల 21, 22 తేదీలలో ఆయన విజయవాడ లో బస చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ  నేతలతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. 
 
 
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానితులు, సీనియర్ నాయకులతో ఉమెన్ చాందీ సమావేశమవుతారు. అలాగే 22న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో పీసీసీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు పలువురు పార్టీ శ్రేణులు ఆయనతో సమావేశమవుతారు.
 
 
రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం 7 గంటలకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లోఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పాల్గొంటారని  ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి , ఇంఛార్జి (ఆర్గనైజేషన్) పరస రాజీవ్ రతన్ వెల్లడించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కావాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments