Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకు వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:52 IST)
కృష్ణా జిల్లా కంచికచర్లలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని పేరకలపాడులో ఈతకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు.

గుజ్జర్లంక గణేష్ (8), శ్రీమంతు (5), గౌతమ్‌ (4) ముగ్గురూ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం కర్ణాటక వెళ్లగా.. చిన్నారులు నాయనమ్మ వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. మధ్యాహ్నం బహిర్భూమి కోసం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత ఒకరు అందులో మునిగి చనిపోయారు. దూరం నుంచి గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామస్థులు, పోలీసులు చెరువులో సుమారు గంటసేపు గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.

మృతిచెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నందిగామ గ్రామీణ సీఐ సతీష్, ఎస్సై శ్రీహరి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను చుసిన స్థానికులు కంటతడి పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments