Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రామ సెక్రటేరియట్లపైన కలెక్టర్లు దృష్టిపెట్టాలి: సీఎం జగన్

గ్రామ సెక్రటేరియట్లపైన కలెక్టర్లు దృష్టిపెట్టాలి: సీఎం జగన్
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:22 IST)
వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాలపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రింటర్, స్కానర్, నెట్, అన్నీ ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. గ్రామ సెక్రటేరియట్‌ పక్కనే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. 
 
కల్తీలేని వాటిని రైతులకు అందుబాటులో ఉంచగలిగితే రైతులకు మంచి చేసినట్టేనని, గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ పోస్టుల కోసం 22 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారనే నమ్మకంతో తానున్నట్టు తెలిపారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఇన్ని లక్షల మంది రాయడం కూడా ఎప్పుడూ జరగలేదని తెలిపారు. 
 
ఒక చరిత్రను మనం సృష్టిస్తున్నాం, నా కలెక్టర్లు, నా ఎస్సీలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నేను గర్వంతో చెప్తున్నాను, ఎక్కడా విమర్శలు రాకుండా, పూర్తి పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. అలాగే, క్రీడలు గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సీఎం దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. 
2014 రాష్ట్ర విభజన తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ఇవ్వండి. 
బంగారు పతకం వచ్చిన వారికి రూ.5లక్షలు వెండి వచ్చిన వారికి రూ.4లక్షలు, కాంస్యం వచ్చిన వారికి రూ.3 లక్షలు ఇవ్వండి. 
 
జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు, వెండిపతకం వచ్చిన వారికి రూ.75 వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు. 
వీరికి ప్రోత్సాహం ఇస్తేనే వీళ్లంతా సింధులుగా మారుతారు. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఈ కార్యక్రమం చేద్దామని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు నెలల్లోనే ఏపీ పాలన తిరోగమనం : కళా వెంకట్రావు