Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సచివాలయ పోస్ట్‌ల కోసం పరీక్షలు.. కీలక సూచనలివే..

Advertiesment
Instructions
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్‌ల కోసం పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు కీలక సూచనలు..
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీకి తొలి అడుగు పడబోతోంది. సచివాలయ పోస్ట్‌లకు సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు శాశ్వత ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులవుతారు. 
 
ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. అభ్యర్థుల కోసం అధికారులు పలు సూచనలు చేసారు. ఆ సూచనలను మీరూ చూడండి.
 
* ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌లను ముందస్తుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
* గంటముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి 
* పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
* హాల్‌టికెట్‌, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి 
 
* పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు 
* కూడళ్లు, బస్టాండ్‌లలో రూట్‌మ్యాప్‌లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు 
* 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి
* పరీక్షల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది 
 
* నాలుగు తప్పులకు ఒక మార్కును తీసివేస్తారు 
* రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం 
* టెక్నికల్‌ పేపర్‌ మాత్రం ఆంగ్లంలో ఉంటుంది 
* మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాత్‌రూంలో బంగారు బిస్కెట్లు .. స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు