Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో భార్య సన్నిహితంగా... అర్థరాత్రి కత్తెరతో భర్త...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (22:29 IST)
అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు కూడా. తాజాగా పశ్చిమ గోదావరిజిల్లా గణపవరం మండలం జగన్నాథపురంలో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
క్రిష్ణమనాయుడు, సావిత్రమ్మకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. సంవత్సరం క్రితమే వివాహం చేసి పంపించేశారు. ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉండేవారు. క్రిష్ణమనాయుడు స్థానిక రైతు. సావిత్రమ్మ తన ఇంటికి సమీపంలోని ఒక యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత రెండు నెలలుగా ఈ తతంగం సాగుతోంది. అయితే భర్తకు తెలిసి మందలించాడు.
 
అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోని కత్తెరతో ఆమె పొట్టలో నాలుగుసార్లు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సావిత్రమ్మ మరణించింది. క్రిష్ణమనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments