Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా తీర్థం పుచ్చుకున్న అలీ.. పోటీ చేయట్లేదు.. ప్రచారం చేస్తా..!

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (10:25 IST)
ప్రముఖ హాస్యనటుడు అలీ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అలీ ఆ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అనంతరం అలీ దాదాపు పావు గంటపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ కండువా వేసి పార్టీలోకి అలీని జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. 
 
గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని ఆశించిన అలీ ఇటీవలే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన ఓటరు నమోదు దరఖాస్తు అందించారు. కానీ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఆయన లోటస్‌పాండ్‌వైపు మళ్లినట్టు భావిస్తున్నారు. అలీ గుంటూరు లేదా రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలీ వెంట సినీ నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు.
 
వైకాపా తీర్థం పుచ్చుకున్నాక అలీ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా వైకాపాకు ప్రచారం చేస్తానని.. పోటీ సంగతిని ప్రస్తుతానికి పక్కనబెట్టానని అలీ చెప్పారు. స్థానికులకు సీటు ఇవ్వకుండా అలీకి ఇస్తే.. ఇబ్బందులు ఏర్పడుతాయని జగన్ చెప్పారని.. ఆయన చెప్పినట్లు ప్రచారానికి పరిమితం అవుతానని అలీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments