Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వార్డులో డాక్టర్ వేషంలో మోసాలకు పాల్పడుతున్న మాయలేడి

Webdunia
గురువారం, 30 జులై 2020 (15:16 IST)
కరోనావైరస్ రోగి దగ్గరికి వెళ్లాలంటే కుటుంబ సభ్యులు సైతం హడలిపోతున్న తరుణంలో ఓ మాయా లేడి ఏకంగా వైద్యురాలి వేషంలో కరోనా వార్డులో తిరుగుతూ మొబైల్ పోన్లు కొట్టేస్తూ రోగుల బంధువుల నుంచి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతుంది.
 
ఇప్పుడామె కటకటాల వెనక్కి చేరింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ వైద్యుల సంఖ్య కూడా ఎక్కువే. పీపీఈ కిట్ ధరిస్తే ఎవరు వైద్యులో ఎవరు కాదో చెప్పడం చాలా కష్టం. దీన్ని ఆసరాగా చేసుకొని శైలజ(43) అనే మహిళ డాక్టర్ వేషం వేసి కరోనా వార్డులో చోరీలకు తెగపడింది.
 
కరోనా పేషెంట్ల ఫోన్లు కాజేయడమే కాకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తామని చెబుతూ రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. తమ వాళ్ల పరిస్థితి ఏమని ఎవరైనా అడిగితే వారి పరిస్థితులను ఆసరాగా చేసుకొని వారి దగ్గరనుండి డబ్బుల వసూలు చేసేది. పీపీఈ కిట్‌తో నిత్యం కరోనా వార్డులో తిరుగుతున్న శైలజ గురించి సెక్యూరిటి సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు ప్రశ్నించగా పారిపోయింది.
 
మళ్లీ మరుసటి రోజు రావడంతో మహిళా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments