Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసుపత్రికి వెళ్తుంటే ఆయువు తీసిన తమిళనాడు ఆర్టీసి బస్సు

Webdunia
శనివారం, 8 మే 2021 (16:18 IST)
గూడూరు గ్రామీణం: ‘ఒంట్లో కాస్త నలతగా ఉంది.. నేను, నాన్న ఆసుపత్రికి వెళ్తున్నాం.. పది గంటలకల్లా వచ్చేస్తాం.. నువ్వు, చెల్లి జాగ్రత్త.. పరిస్థితులు బాగా లేవు.. బయట తిరగకండి.. ఇంట్లోనే ఉండండి’ అంటూ బిడ్డలకు జాగ్రత్త చెప్పింది. ఆపై దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై నెల్లూరుకు బయల్దేరారు. ఈలోపే వారిపై విధికి కన్నుకుట్టింది.

వారు వెళ్తున్న వాహనాన్ని బస్సు ఢీకొనడంతో.. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా- భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన గూడూరు పట్టణ సమీపాన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. కోట మండలం రామచంద్రపురానికి చెందిన కొమ్మలపూడి వెంకటేశ్వర్లు, కృష్ణమ్మ(38) దంపతులు.

వీరికి ఇంటర్మీడియట్‌ చదువుకున్న కుమారుడు, పదో తరగతి అభ్యసిస్తున్న కుమార్తె ఉన్నారు. కృష్ణమ్మకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చూపించేందుకు ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గం మధ్యలోని గూడూరు సమీప జాతీయ రహదారిపై వెళ్తుండగా- వెనుక నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ దుర్ఘటనలో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోగా- కృష్ణమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే కన్నుమూశారు. వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయన్ను 108 వాహనంలో గూడూరు ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు మనుబోలు వద్ద పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments