Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు ఇచ్చాడు, అర్థరాత్రి వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ ఇంటి తలుపులు బాదాడు, ఆ తరువాత?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:23 IST)
క్రిష్ణాజిల్లా ఉయ్యూరు ప్రాంతం. 40 యేళ్ళ మహిళ తన 22యేళ్ళ కూతురితో కలిసి ఉంటోంది. భర్త అనారోగ్యంతో రెండేళ్ళ క్రితం చనిపోయాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితో ఇన్నిరోజులు నడుపుకుంటూ వచ్చింది. అయితే కుమార్తె చదువులకు అవసరమైన డబ్బులు గత సంవత్సరం వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకుంది. 
 
సుమారుగా 2 లక్షల రూపాయల వరకు తీసుకుంది. ఎలాంటి ఆస్తులు వడ్డీ వ్యాపారికి తనఖా పెట్టలేదు. వడ్డీ మాత్రం గత ఆరునెలల నుంచి కడుతూ వస్తోంది. అయితే ఈ మధ్య వడ్డీ కట్టడానికి డబ్బులు కూడా లేవు. ఆమె నడుపుతున్న టీ దుకాణం కూడా పూర్తిగా లాక్ డౌన్ వల్ల మూసివేయడం.. అంతకుముందు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనడంతో డబ్బులు కట్టలేకపోయింది.
 
దీంతో వడ్డీ వ్యాపారి ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టడం.. డబ్బులు అడగడం.. ఇదే పనిగా పెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారి బాధ భరించలేక ఇంట్లో ఉన్న కుమార్తెను తన స్నేహితురాలి ఇంటికి పంపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వడ్డీ వ్యాపారి అధికార పార్టీకి చెందిన నాయకుడి తమ్ముడి కావడంతో పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments