Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ఇల్లాలు స్నానం చేస్తుండగా పోటోలు.. వీడియోలు తీసిన కామాంధుడు

Webdunia
మంగళవారం, 14 మే 2019 (22:09 IST)
ఓ ఇల్లాలు బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా, ఓ పోకిరీ ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక వివరాల్లోకి వెళితే శ్రీకాకుళంకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం గుంటూరుకు వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 
 
అయితే ఆ ఇంటి పరిసరాల్లో ఉండే ఓ పోకిరీ ఆ ఇల్లాలు స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే ఉద్దేశంతో ఆ ఇల్లాలు భర్తకు కూడా ఈ విషయం చెప్పలేదు. పోకిరీ వేధింపులు మరింత పెరిగిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 
 
ఆమె ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. దీనిపై ఆమె భర్త మాడ్లాడుతూ, సదరు పోకిరీకి వారి కుటుంబ సభ్యులు కూడా సహకరించారని, వెంటనే నిందితుడిని, అతడి కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. బాధితురాలి భర్తతో పాటు స్థానిక మహిళలు నిరసన తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ సాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments