Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో ఓ తండ్రి కన్నకూతురునే హతమార్చాడు. పెద్దల్ని కాదని ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాళెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఒంగోలులో డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి అనే అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 
 
కూతురు వైష్ణవి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తెలిసిన తండ్రి కోపంతో రగిలిపోయాడు. కన్నకూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి గొంతునులిమి హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments