Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడుతో కలిసి అసభ్యభంగిమలో తల్లి... కళ్లారా చూసిన కుమార్తె.. ఆపై....

Advertiesment
Haryana
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (09:26 IST)
తన తల్లి పరాయి వ్యక్తితో చూడకూడని భంగిమలో ఉండటాన్ని ఓ బాలిక చూసింది. పైగా, ఈ విషయాన్ని నాన్నతో పాటు.. తాతతో చెబుతానని తల్లిని కుమార్తె హెచ్చరించింది. అంతే.. ఆ తల్లి కసాయిగా మారిపోయింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాల్ పట్టణానికి చెందిన ఓ లక్ష్మి అనే మహిళకు సోనమ్ అనే పదేళ్ళ కుమార్తె ఉంది. లక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన అనంత్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఆ చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగివచ్చిన ఆ చిన్నారి... తన తల్లి లక్ష్మి ఆమె ప్రియుడు అమిత్ కుమార్‌తో అభ్యంతరకర పరిస్థితిలో ఉండటాన్ని చూసింది. ఈ విషయమైన తండ్రితో చెబుతానని హెచ్చరించింది.
 
దీంతో భయపడిపోయిన తల్లి, ఆమె ప్రియుడు కలిసి ఆ చిన్నారిని అమానుషంగా హతమార్చారు. తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని నదిలో పడవేశారు. అయితే సోనమ్ అదృశ్యమైన నేపథ్యంలో పోలీసు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లక్ష్మితో పాటు అనంత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఇది బడ్జెట్ కాదు... అకౌంట్ ఫర్ ఓట్స్' : చిదంబరం సెటైర్లు