Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హౌస్ ఓనర్ కుమార్తెపై వాచ్‌మెన్ అత్యాచారం...

హౌస్ ఓనర్ కుమార్తెపై వాచ్‌మెన్ అత్యాచారం...
, గురువారం, 31 జనవరి 2019 (20:10 IST)
జీవనాధారం కోసం దుబాయ్ వెళ్లిన ఓ పాకిస్థాన్ యువకుడు చేసిన నీచమైనికి పాల్పడ్డాడు. తాను పని చేస్తున్న ఇంటి యజమాని కుమార్తెపై పలుమార్లు అత్యాచానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
21 సంవత్సరాల వయస్సు గల పాకిస్థాన్ యువకుడు ఉద్యోగం కోసం దుబాయ్‌కి వలసపోయాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ పనిలో చేరాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఓ మహిళ తన తల్లితో పాటు మానసిక వైకల్యంతో బాధపడుతున్న 18 సంవత్సరాల వయస్సు గల కూతురితో నివాసం ఉంటోంది. 
 
అయితే ఆ ఇంటికి డూప్లికేట్ తాళాన్ని సిద్ధం చేసుకున్న అతను ఆమె తన తల్లితో పాటు బయటకు వెళ్లినప్పుడు, ప్లాట్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు గత కొన్ని నెలలుగా ఈ నీచానికి పాల్పడుతున్నాడు.
 
కూతురు కొన్నాళ్లుగా మరీ దిగులుగా ఉండటాన్ని గమనించిన తల్లి, దగ్గర కూర్చుని ఓదార్చుతూ కారణం అడిగింది. ఆమె తెలిసీ తెలియని మాటలతో రోజూ ఓ వ్యక్తి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది. దీంతో తల్లి ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
గతేడాది ఆగస్టు నెలలో అల్ రాఫా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో ఆ యువతి అతడిని చూసి భయపడిపోయింది. చివరకు ఆ పాక్ యువకుడు తన తప్పును ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఫిబ్రవరి 20వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగ భృతి పెంపు... చంద్రన్న మరో తాయిలం