Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకున్న యువతి, ముగ్గురు యువకులకు వాట్సాప్ పంపి?

Webdunia
శనివారం, 11 జులై 2020 (22:43 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు మానసికంగా హింసిస్తున్నారంటూ ఒక యువతి సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
భక్తవత్సల నగర్‌లో రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి తన ముగ్గురి స్నేహితులు.. యువకులకు ఆ వీడియోను వాట్సాప్ ద్వారా పంపింది. మీ వల్లే చనిపోతున్నానంటూ ఆ వీడియోలో స్పష్టంగా చెప్పింది. 
 
రమ్య స్థానికంగా నెల్లూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. తనకు దగ్గరగా ఉన్న స్నేహితులు తనను మోసం చేయడం.. మానసికంగా హింసించడంతో తట్టుకోలేని రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో సుసైడ్ లెటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments