Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బాలుడి కిడ్నాప్, ఆచూకీ చెప్పినవారికి పారితోషికం

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (16:50 IST)
తిరుపతిలో ఆరేళ్ళ బాలుడు శివకుమార్ సాహును కిడ్నాప్ చేశారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద కనిపించకుండా పోయాడు చత్తీస్‌ఘడ్‌కు చెందిన బాలుడు. 
 
బాలుడి కిడ్నాప్‌కు సంబంధించిన సి.సి. టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. గత నెల ఫిబ్రవరి 27వ తేదీన శివకుమార్ సాహు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్సనార్థం వచ్చాడు. తిరుమలకు వెళ్ళేందుకు అలిపిరి వద్దనున్న బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద వేచి ఉన్నారు.
 
అయితే సాహు ఆడుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. చిన్నారి కోసం సుమారు రెండు గంటల పాటు తల్లిదండ్రులు వెతికారు. అయితే ఎంతకూ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిసి టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు.
 
గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని తీసుకెళ్ళడాన్ని పోలీసులు గమనించారు. అయితే పోలీసులు రికార్డుల్లో ఆ వ్యక్తి ఎవరన్నది తెలియలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments