Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బాలుడి కిడ్నాప్, ఆచూకీ చెప్పినవారికి పారితోషికం

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (16:50 IST)
తిరుపతిలో ఆరేళ్ళ బాలుడు శివకుమార్ సాహును కిడ్నాప్ చేశారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద కనిపించకుండా పోయాడు చత్తీస్‌ఘడ్‌కు చెందిన బాలుడు. 
 
బాలుడి కిడ్నాప్‌కు సంబంధించిన సి.సి. టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. గత నెల ఫిబ్రవరి 27వ తేదీన శివకుమార్ సాహు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్సనార్థం వచ్చాడు. తిరుమలకు వెళ్ళేందుకు అలిపిరి వద్దనున్న బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద వేచి ఉన్నారు.
 
అయితే సాహు ఆడుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. చిన్నారి కోసం సుమారు రెండు గంటల పాటు తల్లిదండ్రులు వెతికారు. అయితే ఎంతకూ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిసి టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు.
 
గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని తీసుకెళ్ళడాన్ని పోలీసులు గమనించారు. అయితే పోలీసులు రికార్డుల్లో ఆ వ్యక్తి ఎవరన్నది తెలియలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపితే తగిన పారితోషికం ఇస్తామంటున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments