Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు : పబ్‌జీ గేమ్ అడొద్దని మందలించారనీ....

Webdunia
సోమవారం, 13 జులై 2020 (15:26 IST)
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. పబ్‌జీ గేమ్ అడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ బాలుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన శ్యామ్ ప్రసాద్ (14) అనే బాలుడిని అతడి తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు శ్యామ్‌ ఉరి వేసుకున్నాడు.
 
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, బాలుడిని పలమనేరు ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని స్థానికులు చెప్పారు. తన తండ్రి మొబైల్ ఫోన్‌ను తీసుకుని రోజంతా పబ్‌జీ ఆడేవాడని, దీంతో చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు కోప్పడ్డారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments