Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపులు

మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మైతాపూరులో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ తతంగాన్నంతా సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన మృగాళ్లను పోలీస

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (16:22 IST)
మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మైతాపూరులో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ తతంగాన్నంతా సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మైతాపూర్‌లో మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడి.. లైంగిక దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌ చిత్రీకరించారు. 
 
లైంగిక దాడి జరిగిన విషయాన్ని బయటికి చెప్తే.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో జడుసుకున్న ఆ బాలిక మూడు రోజుల పాటు ఆ ఘోరాన్ని బయటికి చెప్పలేదు. చివరికి తల్లిదండ్రుల వద్ద వెల్లడించడంతో.. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతోందని.. బాధితురాలు స్కూలు నుంచి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం