Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెంచుకుంటానని తెచ్చి 13 ఏళ్ల బాలికకు వివాహం... నిద్రమాత్రలిచ్చి శోభనం...

గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13

పెంచుకుంటానని తెచ్చి 13 ఏళ్ల బాలికకు వివాహం... నిద్రమాత్రలిచ్చి శోభనం...
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:57 IST)
గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13 ఏళ్ల కుమార్తెను పెంచుకుంటానంటూ బాలిక మేనత్త నాగలక్ష్మి తన ఊరికి తీసుకవచ్చింది. 
 
బాలికను పాఠశాలకు కూడా పంపిస్తోంది. ఆమె 5వ తరగతి చదువుకుంటోంది. ఐతే ఏమి ఆలోచన చేసిందో తెలియదు కానీ గత నెల నవంబరు 25న ఆ బాలికను కందుకూరు తీసుకెళ్లింది. అక్కడ మాలకొండ స్వామి దేవాలయంలో 35 ఏళ్ల మనోజ్‌తో గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేయించేసింది. 
 
బాలికకు పెళ్లి చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. పెళ్లి చేసిన వెంటనే అభంశుభం తెలియని బాలికను శోభనం గదిలోకి పంపింది. పాలలో నిద్రమాత్రలు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు మనోజ్. తెల్లారిన తర్వాత బాలికకు మెళకువ వచ్చి తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడినా వదలక చిత్రహింసలకు గురిచేసింది. బాలిక తల్లి తన బిడ్డ ఎలా వుందోనని వచ్చిన తర్వాత కానీ అసలు విషయం బయటకు వచ్చింది. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఎవడు' టైప్‌లో ప్రియురాలు మాస్టర్ ప్లాన్... మటన్ సూప్‌ పట్టిచ్చింది...