Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో 8,987మందికి పాజిటివ్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (18:29 IST)
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే టెస్టు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్‌ వస్తోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 8,987 మందికి కరోనా సోకగా వైరస్‌ బారిన పడి 35 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 76 వేల 987కు చేరింది. కరోనా నుంచి 9లక్షల 15వేల 626 మంది బాధితులు కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 53వేల 889 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
తాజాగా నమోదైన మరణాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7వేల 472 కి పెరిగింది. కరోనా బారిన పడి అత్యధికంగా నెల్లూరులో 8 మంది మృతి చెందగా చిత్తూరులో 5, కడపలో 5, అనంతపురంలో 3, కృష్ణా జిల్లాలో 3, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో 2 మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా, గుంటూరు, విశాఖ, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments