Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులకు సున్నా వడ్డీలేని రుణాలు.. రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీ

రైతులకు సున్నా వడ్డీలేని రుణాలు.. రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీ
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (11:13 IST)
రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీ ఇవ్వనుంది ఏపీ సర్కారు. 6,27,906 మంది రైతులకు ఈ రాయితీ లభించనుంది. ఈ క్రమంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. అంతేగాకుండా.. సీఎం జగన్ మంగళవారం వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు.
 
రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. 
 
సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాస్త శాంతించిన కరోనా .. 2.59 లక్షల కేసులు నమోదు