Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టులో 60 పులులు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (15:23 IST)
3727.82 చ.కి.మీ.ల విస్తీర్ణంతో నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు దేశంలోనే అతిపెద్దదని, ప్రపంచ వ్యాప్తంగా పులులు సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నా మన రాష్ట్రంలో చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల పులులు సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ టైగర్‌ రిజర్వు ఫారెస్టులో 60 పులులు ఉన్నాయని... ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా పులులు సంఖ్య తగ్గుతున్నా మన రాష్ట్రంలో ఈ సంఖ్య పెరగిందన్నారు. పులుల రక్షణ అటవీ వన్యమృగాల సంరక్షణలో  నాగార్జునసాగర్ ‌–శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో ఉన్న ఆదిమ చెంచు తెగలు వారు గొప్ప పాత్ర పోషిస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 
 
నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు నిర్వహణలో చెంచుల సహకారంతో సమర్ధవంతమైన మానవవనరుల నిర్వహణకు గాను భారత ప్రభుత్వం, నేషనల్‌ టైగర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ వారు ఎక్సెలెన్స్‌ అవార్డును ప్రధానం చేశారని సీఎంకు వివరించారు.
 
ఈ సందర్భంగా అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించడానికి అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక కృషిని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.
 
ఈ సమావేశంలో నీరబ్‌కుమార్‌ ప్రసాద్, (అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్‌ సిఎస్‌) ఎన్‌. ప్రతీప్‌ కుమార్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌), అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments