కాశీలో తెలుగువారి కోసం మ‌రో అధునాత‌న స‌త్రం ప్రారంభం

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (10:34 IST)
వారణాసిలో తెలుగువారి కోసం మ‌రో అధునాత‌న స‌త్రం నేడు ప్రారంభం అవుతోంది. తెలుగు యాత్రికుల కోసం కాశీలో ఈ అధునాతన కరివెన సత్రం నిర్మించారు. ఈ తెల్ల‌వారుజామున 4:05  నిలకు కాశీ-  పాండే హవేలీలో కరివెన సత్రం నిర్మించిన నూతన భవనాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. 
 
 
వారణాసి (కాశీ) లోని  పాండే హవేలిలో అఖిల భార‌త బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించి, ఈ కార్తీకమాసంలో ఏకాదశి రోజున కాశీ క్షేత్రంలో ఈ సత్రం ప్రారంభించారు. 34 కొత్త గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం ఈ కరివెన సత్రం నిర్మాణం చేశారు. ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం నాలుగు  చోట్ల కరివెన సత్రం ఆద్వర్యంలో నిత్యాన్న దాన, వసతి సౌకర్యం సేవలు అందిస్తున్నారు. 

 
ఇన్ని స‌త్రాలున్నా, కాశీకి భ‌క్తుల రద్దీ పెరుగుతుండటంతో అయిదో భవనాన్ని అఖిల భార‌త బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు ప్రారంభించారు. ఇది యాత్రికుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అఖిల భార‌త బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహ‌కులు తెలిపారు. ఎక్క‌డి నుంచి అయినా ఇందులో గ‌దుల‌ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవ‌చ్చ‌ని, అయితే నియ‌మ నిబంధ‌న‌లు మాత్రం క‌చ్చితంగా పాటించాల‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments