Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి 500 క్యూసెక్కుల తెలుగుగంగ నీళ్లు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:09 IST)
చెన్నై ప్రజల తాగునీటి అవసరాలకుగాను సోమవారం నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని తిరుపతి తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది సెప్టెంబరు ఆఖరి వరకు చెన్నైకి నీటి తరలింపు జరుగుతుందని వివరించారు. కాగా, ఖరీఫ్‌ సీజన్‌లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినట్లు చెప్పారు.

ఆ మేరకు.. తెలుగుగంగ కాలువ కింద రెండవ పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు గుర్తుచేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో రెండవ పంటకు భారీస్థాయిలో గంగ నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని వివరించారు.

కండలేరు జలాశయం నుంచి గత ఏడాది 8.20 టీఎంసీల నీటిని విడుదల చేయడం చరిత్రలో ఇదో రికార్డని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు నీటిని దుర్వినియోగం చేయకుండా పంటలు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments