Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 50 శాతం పెరిగిపోయిన సిజేరియన్‌ ప్రసవాలు

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (15:42 IST)
ఆంధ్ర రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలలో 50 శాతానికి పైగా సిజేరియన్‌ ద్వారానే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన నెలకొంది. ఆపరేషన్ ద్వారా పుట్టిన పిల్లల్లో 50.5 శాతం పట్టణ ప్రాంతాల్లో, 39.3 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 
 
ప్రసవం చుట్టూ అనేక అపోహలు, అపార్థాలు ఉన్నాయి. మంచి రోజు లేదా మంచి సమయంలో ప్రసవించాలని కొందరు ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి ఇష్టపడతున్నారు. కొన్ని ఆసుపత్రులు తల్లికి సాధారణ ప్రసవం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆపరేషన్‌ను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నాయి.
 
దీని వల్ల సాధారణ డెలివరీతో పోలిస్తే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ప్రజలు స్వయంగా ఆపరేషన్ డిమాండ్ చేస్తారు. సాధారణ జననం కంటే ఇది సురక్షితమని వారు నమ్ముతున్నారు 
 
ఇటీవలి రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా గర్భం దాల్చడం, కృత్రిమ గర్భధారణ పెరగడం వంటి కారణాల వల్ల ఆపరేషన్ ద్వారా బిడ్డ పుట్టడం మామూలైపోయిందని వైద్యులు చెప్తున్నారు. ఇది డెలివరీ సమయంలో సమస్యల రేటును పెంచుతుంది. తల్లి- బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడటానికి కొన్ని పరిస్థితులలో ఆపరేషన్ ఎంపిక చేయబడుతుందని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments