Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరంలో దొంగల చేతివాటం : 5 కేజీల బంగారం చోరీ

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:10 IST)
ఏపీలోని విజయనగరం జిల్లాలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. స్థానికంగా ఉండే రవి జ్యూవెలరీ షాపులో 5 కేజీల బంగారాన్ని చోరీ చేశారు. దుండగులు దుకాణం పైకప్పును తొలగించి షాపులోకి ప్రవేశించి మొత్తం 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. 
 
దుకాణం యజమాని బుధవారం ఉదయం షాను తెరిచి చూడగా, అల్మారాల్లోని పెట్టెలు ఖాళీగా కనిపించాయి. దీంతో లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధారాలను సేకరిస్తున్నారు. 
 
చోరీ జరిగిన ప్రాంతాన్ని విజయనగరం జిల్లా డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ శ్రీనివాస రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాలను మరోవైపునకు తిప్పి, బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. చోరీ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారుల సేకరించే పనిలో నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments