Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ చేసుకున్నారు.. పైలోకానికెళ్లారు.. బీటెక్ విద్యార్థుల దుర్మరణం

Webdunia
బుధవారం, 1 మే 2019 (10:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరంతా మందు పార్టీ చేసుకుని ఇంటికి బయలుదేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇబ్రహీంపట్నం శ్రీహిందూ కాలేజీకి చెందిన కొంతమంది విద్యార్థులు వార్షిక పరీక్షలు పూర్తికావడంతో బొమ్మల రామారంలోని పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకున్నారు. తర్వాత కారులో తిరుగు ప్రయాణ మార్గంలో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. 
 
ఈ ప్రమాదంలో కొత్తపేటకు చెందిన స్ఫూర్తి (22), చాదర్‌ఘాట్‌‌కు చెందిన ప్రణీత(22) ప్రగతి నగర్‌కు చెందిన చైతన్య (23)లు మృతి చెందారు. కుట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినిత్ రెడ్డి‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో వినిత్ రెడ్డిని ప్రాణాలు విడిచాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments