Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ చేసుకున్నారు.. పైలోకానికెళ్లారు.. బీటెక్ విద్యార్థుల దుర్మరణం

Webdunia
బుధవారం, 1 మే 2019 (10:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరంతా మందు పార్టీ చేసుకుని ఇంటికి బయలుదేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇబ్రహీంపట్నం శ్రీహిందూ కాలేజీకి చెందిన కొంతమంది విద్యార్థులు వార్షిక పరీక్షలు పూర్తికావడంతో బొమ్మల రామారంలోని పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకున్నారు. తర్వాత కారులో తిరుగు ప్రయాణ మార్గంలో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. 
 
ఈ ప్రమాదంలో కొత్తపేటకు చెందిన స్ఫూర్తి (22), చాదర్‌ఘాట్‌‌కు చెందిన ప్రణీత(22) ప్రగతి నగర్‌కు చెందిన చైతన్య (23)లు మృతి చెందారు. కుట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినిత్ రెడ్డి‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో వినిత్ రెడ్డిని ప్రాణాలు విడిచాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments