Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:07 IST)
ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి మంగళం టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌పి మేడా సుందరరావు ఆదేశాల మేరకు సిఐ వెంకటరవి ఆధ్వర్యంలోని ఆర్‌ఎస్‌ఐ విశ్వనాధ్‌ బృందం సోమవారం నుంచి పూతల పట్టునాయుడుపేట రహదారిలో తనిఖీలు చేపట్టారు.

మంగళవారం తెల్లవారుజామున చంబడిపాలెం సమీపంలోని రోడ్డుకు 50 మీటర్ల దూరంలో పోలీసులను చూసి ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారు. వీరు నెల్లూరు జిల్లా మైపాడు రోడ్‌ సత్యనారాయణపురంకు చెందిన పాలూరి బాలు, తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌కు చెందిన ఆర్‌.మణికంఠన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.30 లక్షలు ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments