Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:07 IST)
ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి మంగళం టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌పి మేడా సుందరరావు ఆదేశాల మేరకు సిఐ వెంకటరవి ఆధ్వర్యంలోని ఆర్‌ఎస్‌ఐ విశ్వనాధ్‌ బృందం సోమవారం నుంచి పూతల పట్టునాయుడుపేట రహదారిలో తనిఖీలు చేపట్టారు.

మంగళవారం తెల్లవారుజామున చంబడిపాలెం సమీపంలోని రోడ్డుకు 50 మీటర్ల దూరంలో పోలీసులను చూసి ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారు. వీరు నెల్లూరు జిల్లా మైపాడు రోడ్‌ సత్యనారాయణపురంకు చెందిన పాలూరి బాలు, తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌కు చెందిన ఆర్‌.మణికంఠన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.30 లక్షలు ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments