Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ 3 రాజధానుల ప్రకటన, ప్లస్సా... మైనస్సా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (18:52 IST)
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి మొత్తం మూడు రాజధానులు ఉండబోతున్నాయని ప్రతిపాదన తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ వాతావరణం కంటే కూడా నెగిటివ్ వాతావరణమే ఎక్కువగా నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచింది. కేవలం ఈ ఆరు నెలలలోనే జగన్ పాలనపై ఏపీ ప్రజల్లో కొన్నింటిపై అసంతృప్తి నెలకొందన్న విషయం పలు సర్వేల్లో వెల్లడైంది. కొంతమంది జగన్ వీరాభిమానులు, వైసీపీ నేతల్లో తప్ప జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల్లో లొసుగులు ముందు చెప్పకుండా తర్వాత మాటలు తెలివిగా మార్చడాలు చాలానే జరిగాయంటున్నారు విశ్లేషకులు. 
 
మరోవైపు ఇసుక కొరత, రైతుల సమస్యలు ఇలా ఎన్నో అంశాలు ఎన్నడూ లేని విధంగా పెను సమస్యల్లా మారాయి. ఇప్పుడు రాజధాని సమస్య వీటితో చేరింది. చాలామంది సామాన్య ప్రజానీకం జగన్ నిర్ణయంతో ఏకీభవించడం లేదన్న వాదనలు వినబడుతున్నాయి. జగన్ కానీ ఇదే పంథాను కొనసాగిస్తే ఆయన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments