Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్టు బాదారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (19:35 IST)
కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఒక్కో సందర్భంలో ఇవి శృతిమించడంతో వైద్య సిబ్బంది ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు వార్తల్లో వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలోని హోజాయ్ జిల్లాలో ఓ జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్లు చావబాదారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనాతో మృతి చెందిన రోగి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
డాక్టర్ సియూష్ కుమార్ సేనాపతి హోజాయ్‌లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ బంధువు ఈ డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా దాడి జరగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో డాక్టర్ ఉండిపోయారు.
 
ఈ దాడిలో మొత్తం 24 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వారిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆయన ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ ఘటనపై అస్సాం ఐఎంఏ విభాగం ఆందోళనకు దిగింది. ఔట్ పేషెంట్ సర్వీసులను నిలిపివేసి నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments