Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్టు బాదారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (19:35 IST)
కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఒక్కో సందర్భంలో ఇవి శృతిమించడంతో వైద్య సిబ్బంది ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు వార్తల్లో వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలోని హోజాయ్ జిల్లాలో ఓ జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్లు చావబాదారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనాతో మృతి చెందిన రోగి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
డాక్టర్ సియూష్ కుమార్ సేనాపతి హోజాయ్‌లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ బంధువు ఈ డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా దాడి జరగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో డాక్టర్ ఉండిపోయారు.
 
ఈ దాడిలో మొత్తం 24 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వారిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆయన ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ ఘటనపై అస్సాం ఐఎంఏ విభాగం ఆందోళనకు దిగింది. ఔట్ పేషెంట్ సర్వీసులను నిలిపివేసి నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments