Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి ఆదాయపన్ను శాఖ అధికారులపై వేటు

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:19 IST)
అవినీతి, అక్రమాలకు పాల్పడిన విశాఖ, రాజమండ్రి ఐటీఓలతోపాటు 85 మంది ఆదాయపుపన్ను శాఖ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అవినీతికి పాల్పడిన ఇద్దరు ఏపీ ఆదాయపుపన్ను శాఖ అధికారులకు నిర్బంధ పదవీ విరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రాజమండ్రి ఆదాయపన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణిని సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఆమె వద్ద రూ.1.50 లక్షల లంచం డబ్బు లభించింది. విశాఖపట్టణానికి చెందిన మరో ఐటీఓ అధికారి వద్ద రూ.75 వేల లంచం సొమ్ము దొరికింది. దీంతో వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
 
రాజమండ్రి, విశాఖ ఐటీఓలతో పాటు 21 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారులను నిర్బంధ పదవీవిరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యేడాది ఐదు విడతలుగా 85 మంది ఆదాయపు పన్నుశాఖ అవినీతి అధికారులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వేటు వేసింది. 
 
ఇందులో 64 మంది సెంట్రల్ బోర్డు, కస్టమ్స్, సీబీడీటీ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖలో అవినీతి అధికారులపై వేటు వేసేందుకే వారితో నిర్బంధ పదవీ విరమణ చేయించామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments