Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 లక్షల దొంగ ఓటర్ కార్డులున్నాయి, బయట పెడతాం: బిజెపి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (20:00 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో సమానంగా పోటీకి సిoద్ధమైంది బిజెపి. బిజెపి నుంచి ఇప్పటివరకు పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలోనే మకాం వేసి నేతలందరినీ కలుపుకుని సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. 
 
అందరిని ఐక్యం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పార్టీ జాతీయ కార్యదర్సి సత్యకుమార్‌లు తిరుపతిలో ఈ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసిపి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
 
అందులో భాగంగా 2 లక్షల నకిలీ ఓటర్ కార్డులను తయారుచేసిందని దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. రెండురోజుల్లో ఎస్ఈసిని కలుస్తామన్నారు సత్యకుమార్. అంతేకాదు టిడిపి.. వైసిపి ఒక్కటై బిజెపిపై కుట్ర పన్నేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
 
రైల్వేప్రాజెక్టులు, సాగరమాల, కోవిడ్ సమయంలో రాష్ట్రానికి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామన్నారు. 5 లక్షల 23 వేల 500 కోట్ల నిధులు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు చెప్పారు. బిజెపిని రాష్ట్రంలో గెలిపించకపోయినా అభివృద్ధిలో లోటు చేయలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments