Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్లు తినడంతో ఇద్దరు చిన్నారులు మృతి.. కర్నూలులో విషాధం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (15:36 IST)
బిస్కెట్లు తినడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. మరో బాలిక తీవ్ర అస్వస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి ఇది జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
మహబూబ్ కొడుకు హుస్సేన్ బాషా(6), కూతురు హుసేన్ బీ(4) కలిసి బాబాయి కూతురు బషిరున్(8)తో కలిసి గ్రామంలోని ఓ కిరాణా షాపులో బిస్కెట్లు కొనుక్కున్నారు. ఆ తర్వాత అంతా కలిసి వాటిని తిన్నారు. కొంతసేపటి తర్వాత చిన్నారులు మెల్లగా అస్వస్థతకు గురయ్యారు. 
 
కుటుంబ సభ్యులు దీన్ని గమనించి వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే హుసేన్ భాషా మరణించాడు. అక్కడే చికిత్స పొందుతూ హుసేన్ బీ కూడా చనిపోయింది. వెంటనే వైద్యులు మరో చిన్నారిని కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments