Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 149కు పెరిగిన కరోనా కేసులు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:41 IST)
కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజు రోజు కు కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 41 కేసులు బయటపడ్డాయి. నెల్లూరు అత్యధికంగా 23 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 149కు చేరింది.

పరీక్షించిన వాటిల్లో 1321 నెగెటివ్‌గా తేలాయి. ఉదయం పదిగంటలకు 21 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నాలుగు గంటలకు మరో మూడు నిర్థారణ అయ్యాయి.

ఆరుగంటలకు ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. రాత్రి పదిగంటలకు మరో 7 కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారివిగానే నిర్థారణ అయింది. 
 
వైద్య సిబ్బందికి పిపిఇల సరఫరాకు చర్యలు : డాక్టర్‌ జవహర్‌ రెడ్డి 
వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా ఆస్పత్రికీ వెయ్యి వ్యక్తిగత సంరక్షణ పరికరాల(పిపిఇ)ను సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలతోపాటు గుంటూరు, కడపలో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments