Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జన్‌ధన్' నగదు ఎప్పుడెవరు తీసుకోవచ్చంటే..?!

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:33 IST)
ప్రధాన మంత్రి జన్​ధన్​ ఖాతాల్లోని నగదు ఉపసంహరణకు కేంద్రం ఆంక్షలు విధించింది. ఖాతా సంఖ్యల ఆధారంగా తేదీలు కేటాయించింది. ప్రధాన మంత్రి జన్​ధన్‌ ఖాతాల్లో రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేయనున్న కేంద్రం.. రేపటి నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.

కరోనా ప్రభావం కారణంగా ఖాతాదారులు అంతా ఒకేసారి బ్యాంకుల వద్దకు వెళ్లకుండా నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. జన్​ధన్‌ ఖాతాదారులు ఆంధ్రప్రదేశ్‌లో 1,18,55,366 మంది ఉండగా.. తెలంగాణలో 52 లక్షల 23వేల 218 ఖాతాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,70,78,584 జన్​ధన్‌ ఖాతాలున్నాయి.

ఒక్కసారిగా ఖాతాదారులు బ్యాంకు శాఖలకు, ఏటీఎంల వద్దకు నగదు ఉపసంహరణ కోసం గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు.

ఖాతా సంఖ్య చివరన.. 0 లేక 1 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 3న, 2 లేక 3 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 4న, 4 లేక 5 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 7న, 6 లేక 7 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 8న, 8 లేక 9 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 9న నగదు తీసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 9వ తేదీ లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తరువాత అయినా తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments