ఆత్మకూరు బరిలో 14 మంది అభ్యర్థులు.. అయినా గెలుపు ఏకపక్షమే..

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (11:45 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినప్పటికీ ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగనున్నాయి. దీనికి కారణం ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు పోటీకి దూరంగా ఉండటం.
 
ఈ స్థానం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల కోసం మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
అయితే, నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన గురువారం బొర్రా సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో తుది పోరులో 14 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ స్థానానికి ఈ నెల 23వ తేదీ పోలింగ్ జరుగనుండగా, 26వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 
 
ఈ ఎన్నికల బరిలో ఉన్న వారిలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ తరపున భరత్ కుమార్, బీఎస్పీ తరపున నందా ఓబుల్‌లు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పోటీకి దూరంగా ఉన్నాయి. 
 
కాగా, ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,330 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments