Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ పాసైన ఆనందంలో కూల్‌డ్రింక్స్ కోసం వెళ్తే టాటా ఏస్ కాటేసింది...

Crime News
Webdunia
బుధవారం, 15 మే 2019 (13:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణతా శాతం నమోదైంది. ఇలా పాసైన వారిలో రుక్మిణి అనే బాలిక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. టెన్త్ పాసయ్యానన్న ఆనందంలో కూల్‌డ్రింక్స్ తెచ్చి తన స్నేహితులకు ఇవ్వాలని రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన టాటా ఏస్ కంపెనీ ఆ బాలికను ఢీకొట్టింది. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కలవచర్ల గ్రామంలో జరిగింది. పదో తరగతి ఫలితాలు రాగానే, ఆనందంతో తన చెల్లెలితో కలిసి తిరుగుపల్లి రుక్మిణి (15) రోడ్డు పక్కన ఉండే ఓ దుకాణానికి శీతలపానీయం కోసం వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన టాటా ఏస్ - మ్యాజిక్ అక్కాచెల్లెళ్లను ఢీక్కొట్టింది. 
 
ఈ ఘటనలో రుక్మిణి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, ఆమె చెల్లికి గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. రుక్మిణి సోదరిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు టాటా ఏస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments