Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌ కు 103 మంది వలసకార్మికుల తరలింపు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:31 IST)
రవాణా సదుపాయం లేక లారీలలో ప్రయాణిస్తున్న సుమారు 103 మంది వలస కార్మికులను శుక్రవారం ఉదయం తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లారీలను సీజ్‌ చేసి అదుపులోకి తీసుకున్నవారినందరిని తుని గ్రామీణ హంసవరం ఎపి మోడల్‌ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటరుకు తరలించారు.

ఎపి 39 టిడి-2939 లారీలో 39 మంది హనుమాన్‌ జంక్షన్‌ నుండి అనకాపల్లికి, ఎపి 39 టిడి-2777 లారీలో 31 మంది రాజమండ్రి నుంచి అనకాపల్లికి, ఎపి 39 టిడి 1249 లారీలో 33 మంది కత్తిపూడి నుండి అనకాపల్లి కి వెళ్లేందుకు లారీలలో ప్రయాణిస్తున్నారని తెలిపారు.

తుని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద తుని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... మూడు లారీలలో ప్రయాణిస్తున్న మొత్తం 103 మంది వలస కార్మికులను గుర్తించామన్నారు.

అప్రమత్తమైన పోలీసులు ప్రయాణిస్తున్నవారినందరిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుని రూరల్‌ సిఐ కిషోర్‌, కోటనందూరు ఎస్సై అశోక్‌, బోర్డర్‌ విధులలో ఉన్న విశాఖ ఏపీఎస్పీ ఆర్‌ఐ రాజు, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments