Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు : మంత్రి మోపిదేవి

క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు : మంత్రి మోపిదేవి
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (09:03 IST)
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరగడం దురదృష్టకరమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 109 పాజిటీవ్ కేసులు నమోదయినట్లుగా చెప్పారు.

ఇలాంటి సమయంలో క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనాపై ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుదని చెప్పారు.

గుంటూరు జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని,  5,190 మందికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ఇంటికి పంపించాలని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడిలు వస్తున్నాయని మంత్రి మోపిదేవి అన్నారు.

అయితే 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నవారికి నెగిటీవ్ రిపోర్టు వచ్చి.. బయటకు వెళ్లిన తర్వాత వారికి మళ్లీ పాజిటీవ్ వచ్చే అవకాశం ఉందని, జాతీయ స్థాయిలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 28 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంగా చెబుతున్నామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని మంత్రి మోపిదేవి కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబువి నీచ రాజకీయాలు: మంత్రి పెద్దిరెడ్డి