Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ గోదావరి: పడవలో అగ్నిప్రమాదం.. 120 మంది ప్రయాణీకులు?

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, బియ్యపుతిప్ప- ఉప్పుటూరు వద్ద గోదావరిలో పడవ బోల్తా పడటంతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే పశ్చిమగోదావరిలో వందకి మించిన ప్రయాణీకులతో ప్రయాణి

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (12:45 IST)
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, బియ్యపుతిప్ప- ఉప్పుటూరు వద్ద గోదావరిలో పడవ బోల్తా పడటంతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే పశ్చిమగోదావరిలో వందకి మించిన ప్రయాణీకులతో ప్రయాణించిన పడవలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
  
 
పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణీకులను సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. పాపికొండలను తిలకించేందుకు వెళ్తున్న ప్రయాణీకులను పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాపికొండలను చూసేందుకు వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 
 
అయితే అప్రమత్తమైన పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణీకులను కాపాడారు. పోశమ్మ గుడి వద్ద నుండి బయలుదేరిన పది నిమిషాలు కాగానే దేవీపట్నం మండలం వీరవరపులంక వద్దకు చేరుకోగానే పడవలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.   

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments