Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు వ్యానును ఢీకొన్న కాలేజీ బస్సు.. వేర్వేరు ప్రాంతాల్లో..?

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:03 IST)
Accident
ఏపీలోని నంద్యాల జిల్లాలోని తమ రాజు పల్లె సమీపంలో మూలమెట్ట పెద్దమ్మ తల్లి యూటర్న్ వద్ద విజయానికేతన్ స్కూల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
సంఘటన అనంతరం చిన్నారులను ఇళ్ళకు తిరిగి పంపించేశారు. బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
మరోవైపు తమిళనాడులోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తిరుచ్చి-తిరువానైక్కావల్‌లో స్కూలు వ్యానును కాలేజీ బస్సు ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులతో పాటు 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
ఈ ప్రమాదంతో తిరువానైకావల్ శ్రీరంగం ప్రధాన రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments