Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు... నేను పారిపోను.. మీరు ధైర్యంగా ఉండాలి.. తిరగబడాలి : పవన్

ఠాగూర్
బుధవారం, 1 మే 2024 (22:06 IST)
ఒక సమస్యపై ధైర్యంగా నిలబడాలి. పోరాడాలి. తిరగబడాలి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేనున్నాను కదా... నేను పని చేస్తా.. ఈ ఇద్దరితో పని చేయిస్తా.. ఈ మేరకు హామీ ఇస్తున్నా.. నేను పారిపోను.. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? అని పవన్ వ్యాఖ్యానించారు. 
 
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో బుధవారం వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొన్నారు. ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని మార్చండి.. తీసుకెళ్లి తుంగలో తొక్కండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. మార్చుదాం.. సంకల్పిద్దా.. బలమైన భవిష్యత్‌ను నిర్మించుకుందాం అని పేర్కొన్నారు. 
 
మీకు జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదు. ఉపాధి అవకాశాలు కల్పించలేదు. అతడికి ఓటేస్తారా? మరి ఏం చేద్దాం.. జగన్‌ను గద్దె దించుదాం.. మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం... ఒక సమస్యపై  ధైర్యంగా నిలబడాలి, తిరగబడాలి అంటూ పిలుపునిచ్చారు. 
 
పనిలోపనిగా జగన్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లతో ఉందన్నారు. దీనిపై మాట్లాడాల్సింద.. చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలేనని, ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడితేనే మార్పు తథ్యం అని పవన్ అన్నారు. అంతేకానీ, ప్రసంగిస్తుంటే ఎరుపు కండువాలు విసిరితే  ప్రయోజనం లేదని పవన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments