Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పోలింగ్ సమయం పొడగింపు... ఎందుకో తెలుసా?

ఠాగూర్
బుధవారం, 1 మే 2024 (21:56 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలో లోక్‍‌సభ స్థానాలకు పోలింగ్ జరిగితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కలిసి ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నారు. సాధారణంగా పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. కానీ, తెలంగాణాలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. వీటికితోడు వడగాలులు బలంగా వీస్తున్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెనుకంజ వేస్తారని భావించిన రాజకీయ పార్టీల నేతలు... పోలింగ్ సమయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ... తెలంగాణాలో మాత్రం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments