ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పే : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:33 IST)
సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమటలో ఓయన ఓటు వేశారు. 
 
ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికలు సజావుగా జరగాలని ఆయన కోరారు. అయితే, అనంతపురంలో జనసేన అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేయడంపై స్పందిస్తూ, మధుసూదన్ గుప్తా చర్య ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. 
 
కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇంతకు మించి ఏం చెప్పలేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. 
 
మరోవైపు, కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం చౌటపల్లిలో 172, 173 పోలింగ్ బూత్‌లలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళితే వారు తక్షణం స్పందించి పోలింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కొత్త ఈవీఎంను అమర్చి, మళ్లీ పోలింగ్‌ ప్రారంభించారు.
 
అలాగే విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో... సైకిల్‌కు ఓటేస్తే బీజేపీకి పడుతుడడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ కేంద్రంలో పోలింగ్‌ నిలిపివేశారు. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments