Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పే : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:33 IST)
సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమటలో ఓయన ఓటు వేశారు. 
 
ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికలు సజావుగా జరగాలని ఆయన కోరారు. అయితే, అనంతపురంలో జనసేన అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేయడంపై స్పందిస్తూ, మధుసూదన్ గుప్తా చర్య ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. 
 
కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇంతకు మించి ఏం చెప్పలేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. 
 
మరోవైపు, కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం చౌటపల్లిలో 172, 173 పోలింగ్ బూత్‌లలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళితే వారు తక్షణం స్పందించి పోలింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కొత్త ఈవీఎంను అమర్చి, మళ్లీ పోలింగ్‌ ప్రారంభించారు.
 
అలాగే విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో... సైకిల్‌కు ఓటేస్తే బీజేపీకి పడుతుడడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ కేంద్రంలో పోలింగ్‌ నిలిపివేశారు. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments