Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఎన్నికల ప్రచార యుద్ధానికి తెర... ఆ తర్వాత తాయిలాలతో ఎర

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదలతో పొలిటికల్ వేడి మరింత పెరిగింది. ఇదిలావుంటే ఈనెల 11వ తేదీ గురువారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు అన్ని ప్రచార మైకులు మూగబోనున్నాయి. అంటే ప్రచార యుద్ధానికి తెరపడనుంది. 
 
ఇప్పటివరకు బాకా ఊది ప్రసంగించిన నేతలంతా మంగళవారం సాయంత్రం నుండి విశ్రాంతి తీసుకోనున్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ల వద్ద రేపటి నుండే 144 సెక్షన్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
కాగా ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, వారిని తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో నేతలు వీలైనంత వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. 
 
అలాగే ఓటర్లు తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఇప్పటికే ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగనుండగా, మే 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments