Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్తెనపల్లిలో కోడెలపై వైకాపా దాడి.. మోకాలికి గాయం...

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా అనేక ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, వైకాపా, టీడీపీల మధ్య పోటాపోటీ ఉన్న ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. 
 
విపక్ష పార్టీ వైకాపా శ్రేణులు మాత్రం రెచ్చిపోతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్న అధికారులపైనా వారు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. వీరిమధ్య జరిగిన తోపులాటలో స్పీకర్‌ కోడెల చొక్కా చిరిగిపోయింది. 
 
ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో కోడెల మోకాలికి కూడా చిన్నపాటి రక్తగాయమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments