Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ అమ్మకు ఇంటి పత్రాలు ఇచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (22:27 IST)
త‌మిళ‌నాడులో కేవ‌లం రూ.1కే ఇడ్లీలు అమ్మిన వృద్ధురాలు అందరికీ గుర్తుండే వుంటుంది. ఆమెను అక్క‌డంద‌రూ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. ఆమె అస‌లు పేరు కె.క‌మ‌ల‌త‌ల్‌. 2019 సెప్టెంబ‌ర్ నెల‌లో ఆమె గురించిన ఓ వీడియో వైర‌ల్ అయింది. 
 
ఆమె క‌ట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేస్తూ పేద‌లు, కూలీల‌కు కేవ‌లం రూ.1కే ఒక ఇడ్లీ అమ్మేది. ఆమె అలా 30 ఏళ్ల నుంచి ఇడ్లీల‌ను త‌యారు చేసి అందిస్తోంది. అయితే ఆమె వీడియో వైర‌ల్ అయ్యాక ఆమెకు స‌హ‌యం చేసేందుకు చాలా మంది ముందుకు వ‌చ్చారు.
 
ఇలా కమ‌ల‌త‌ల్ వీడియో వైర‌ల్ అయ్యాక మహీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఎల్‌పీజీ క‌నెక్ష‌న్ ఇప్పించారు. అలాగే ఆమెకు ఇల్లు క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయ‌న ఆమెకు తాజాగా ఇంటిని అంద‌జేశారు. ఆమె ఇంటి ప‌త్రాల‌ను అందుకుంది.

అప్ప‌ట్లో ఆమె త‌న‌కు ఓ ఇల్లు ఉంటే బాగుండున‌ని, దీంతో మ‌రింత మందికి ఇడ్లీల‌ను విక్ర‌యించేదాన్న‌ని చెప్పింది. ఆమె కోరిక తెలుసుకున్న ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఇంటిని అంద‌జేశారు. ఆమెకు ఇంటిని అందించినందుకు గాను నెటిజ‌న్లు ఆనంద్ మ‌హీంద్రాను కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments