Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకు ఎర్రగా పండాలంటే...

మహిళల అలంకరణ ప్రాధాన్యాల్లో గోరింటాకుది ప్రత్యేకమైన స్థానం. అట్లతద్ది వంటి పండుగలకు గోరింటాకు పెట్టుకోవటం తెలుగు నేల ఆనవాయితీ. చిన్నశుభకార్యం మొదలు పండగలూ, పెళ్ళిళ్ళ వరకు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతారు. గోరింటాకుతో పండిన చేతులు, పాద

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (20:02 IST)
మహిళల అలంకరణ ప్రాధాన్యాల్లో గోరింటాకుది ప్రత్యేకమైన స్థానం. అట్లతద్ది వంటి పండుగలకు గోరింటాకు పెట్టుకోవటం తెలుగు నేల ఆనవాయితీ. చిన్నశుభకార్యం మొదలు పండగలూ, పెళ్ళిళ్ళ వరకు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతారు. గోరింటాకుతో పండిన చేతులు, పాదాల అందాన్ని ఏ నగల, దుస్తులతో పోల్చలేమంటే అతిశయోక్తి కాదు. గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని తెలుగు నాట వాడుకలో ఉన్నమాట.
 
అవకాశం ఉన్నవారు సాధ్యమైనంతవరకు చెట్టు నుంచి సేకరించిన తాజా గోరింటాకును రుబ్బి వాడటం మంచిది. లేని పక్షంలో మార్కెట్లో లభించే మంచి నాణ్యమైన గోరింటాకును ఎంపిక చేసుకోవాలి. గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడినీళ్ళు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్‌ టీలో కనుక కలిపి నానబెట్టినట్లైతే మరింత డార్క్‌ కలర్‌ తో గోరింట పండుతుంది. మెహిందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్‌ కలిపుకొని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల చేతులు పెట్టుకొన్నట్లైతే కాఫీ బ్రౌన్‌ కలర్‌లో పండుతుంది. నిమ్మరసంలో పంచదార వేసి చిక్కటి సిరఫ్‌లా తయారుచేసుకోవాలి.
 
మెహింది చేతులకు పెట్టుకొన్న తర్వాత తడి ఆరేసమయంలో ఈ లెమన్‌ సుగర్‌ సిరఫ్‌ ను చేతులకు అప్లై చేయాలి. దాని వల్ల మెహిందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది ఈ సిరఫ్‌. గోరింటాకు చేతులకు పెట్టుకొన్న తర్వాత అది చేతుల మీద కనీసం ఆరుగంట సమయం అన్నా ఉండేట్లు చూసుకోవాలి. అందుకు లెమన్‌ సుగర్‌ సిరఫ్‌ ను మధ్య మధ్యలో రాస్తుంటే మీరు కోరుకొన్న కలర్‌ మీ చేతుల్లో పండుతుంది. లవంగాలను ఒక పాన్‌ లో వేసి వేయించాలి. వేయించే సమయంలో వచ్చే పొగ మీద రెండు చేతులను ఒక అంగుళం దూరంలో పెట్టి ఆవిరి పట్టించాలి. 
 
ఆ పొగ చేతులకు వేడి పుట్టించి మెహిందీ మరింత ఎర్రగా పండేలా చేస్తుంది. మెహిందీ పెట్టుకొన్న తర్వాత ఈ పెయిన్‌ రిలిఫీ బామ్‌ ను అప్లై చేయడమనేది చాల పాత పద్దతి. దీన్ని ఉపయోగించడం వల్ల చేతులకు వేడి పుట్టించి మెహిందీ బాగా ఎర్రగా పండేలా చేస్తుంది. హెన్నా మిశ్రమానికి ఆవనూనె కలిపి గిన్నెలో పెట్టి దానిపై పొడి గుడ్డ కప్పి 10 గంటల పాటు పొడి వాతావరణంలో ఉంచి వాడితే బాగా పండుతుంది. గోరింటాకు పండిన తర్వాత నేరుగా నీళ్ళు పోసి కడగ కూడదు. ఎండిన హెన్నాను చెంచా లేదా చాకుతో నెమ్మదిగా తొలగించి అరచేతులపై కొంచెం సున్నం (తాంబులంలో వాడేది) వేసి రెండు అరచేతులూ బాగా రుద్ది నీటితో కడగాలి. ఎలర్జీలు బాధితులు సున్నా నికి బదులు కొబ్బరి నూనె తో రుద్దుకొని నీళ్ళతో కడిగితే రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది. గోరింటాకు మిశ్రమానికి పుదీనా గుజ్జు లేక పుదీనా నూనె కలిపితే మరింత పండుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

తర్వాతి కథనం
Show comments